తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీ విభాగం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొని మాట్లాడారు. "గడిచిన అయిదేళ్ళలో వైయస్ఆర్సీపీ పాలనను, నేడు కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు పోల్చుకుంటున్నారు. ఈ పదినెలల పాలనలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజల వద్దకు తీసుకెళదాం. బలహీనవర్గాలు అంటే ఈ సమాజానికి బ్యాక్ బోన్ అని చెప్పిన పూలే ఆశయాలను జగనన్న కొనసాగించారు. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టిన ఏకైక వ్యక్తి జగనన్న. జగనన్న పాలనలో బీసీలకు రాజ్యాధికారం అందజేశారు, చంద్రబాబు మాత్రం కులవృత్తుల వారికి ఆదరణ పేరుతో ద్రోహం చేశారు. లక్షలాదిమంది మన పిల్లలకు నాడు వైఎస్ఆర్ చూపిన ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఇంజినీర్లు, డాకర్లు అయ్యారు. అభినవ పూలే జగనన్నను మరోసారి సీఎం చేసుకుందాం" అని జోగి రమేష్ కోరారు.
#jogiramesh #ysrcp #ysjagan #appolitics #asianetnewstelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️